Apr 22, 2016

ప్రపంచంలోనే అతి సన్నని, నాజూకైన ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ సంస్థ తయారుచేసింది. కేవలం 10.4 మిల్లీమీటర్ల మందం, 13.3 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నదైన ల్యాప్ టాప్ ను 'స్పెక్టర్' పేరుతో మార్కెట్ లోకి వదలనుంది. ఏప్రిల్‌ 25న ప్రీ ఆర్డర్స్ ప్రారంభమవనున్నాయని సమాచారం. ఇంటెల్‌ ఐ5, 7 ప్రాసెసర్‌, బ్యాక్‌లిట్‌ కీబోర్డు, గ్లాస్‌ ట్రాక్‌ప్యాడ్‌, డ్యుయల్‌ స్పీకర్స్‌, గొరిల్లా గ్లాస్‌ డిస్‌ప్లే తదితర ఫీచర్లు కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ ధర 1,169 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. హెచ్‌పీ స్పెక్టర్‌ పేరుతో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్నేషనల్‌ లగ్జరీ కాన్ఫరెన్స్‌ లో ఆవిష్కరించారు.

0 comments:

Post a Comment